calender_icon.png 13 August, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలుకింద పడి యువకుడి మృతి..

12-08-2025 10:45:16 PM

ప్రమాదమా.. ఆత్మహత్యనా..

అదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) తాంసి మండలంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన గుమ్ముల నరేష్ అనే యువకుడు మద్యం మత్తులో మంగళవారం గ్రామ శివారులో రైలుకింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయితే నరేష్ సూసైడ్ చేసుకున్నాడా, లేదా ప్రమదావశాత్తు ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.