14 April, 2026 | 5:17 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

కారులో చెలరేగిన మంటలు

25-11-2025 12:00 AM
  1. ఒకరి సజీవ దహనం,పూర్తిగా కాలిపోయిన వాహనం 
  2. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘటన

మేడ్చల్, నవంబర్ 24(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. కారు దగ్ధమై ఓ వ్యక్తి సజీవ దహనమైన ఘటన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హనుమకొండకు చెందిన దుర్గాప్రసాద్ (30) వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వచ్చి తిరిగి దుండిగల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నాడు.

శామీర్‌పేట్ దాటిన తర్వాత సోమవారం తెల్లవారుజామున కారులో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ వాహనం కాలిపోగా అందులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో హీటర్ ఆన్ చేసి ఉండడంతో దీనివల్ల ప్రమా దం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు పూర్తిగా కాలిపో యినందున మృతుడిని గుర్తించడానికి పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. అతడికి తల్లిదండ్రులు, సోదరులు ఉన్నారు. శామీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.