calender_icon.png 24 August, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంటా చౌరస్తా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

24-08-2025 01:54:54 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో రూ.కోటి టియుఎఫ్ఐడిసి నిధులతో ఈ పనులను చేపట్టనున్నారు. రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచి రహదారిని ప్రజలకు సౌలభ్యంగా మార్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు చిలుమల శంకర్, మునిమంద రమేష్, కన్నయ్య సింగ్, జక్కుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.