24-08-2025 03:54:10 PM
జనగామ (విజయక్రాంతి): పట్టణ కేంద్రంలోని బీరప్ప స్వామి దేవాలయంలో కురుమ సంఘం అధ్యక్షులు మోటే లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సేవెల్లి సంపత్, జిల్లా అధ్యక్షులు కంచె రాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ అధ్యక్షులుగా బాల్దే మల్లేశం, కార్యదర్శిగా జూకంటి శ్రీశైలం, కోశాధికారిగా కేమిడీ ఉపేందర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులు బాల్దే మల్లేశం మాట్లాడుతూ... తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. రెండు సంవత్సరాలలో బీరప్ప స్వామి దేవాలయం నిర్మాణం పూర్తి చేసి, బీరప్ప స్వామి పండగ ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పెద్ద కురుమలు మోటే పర్వతాలు, మోటే శ్రీశైలం, మోట శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జాయ మల్లేశం, కోపగ గౌరవాధ్యక్షులు కర్రె కృష్ణ,కోపా అధ్యక్షులు కడకంచి మధుసూదన్ కోపా కార్యదర్శి మంత్రి శ్రీశైలం, కోపా కోశాధికారి ఎండ్రు వైకుంఠం, మాజీ కౌన్సిలర్ కర్రె శ్రీను, బాల్దే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.