15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

23-04-2025 05:06 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ పట్టణానికి చెందిన మారగాని నాగరాజు-ఉష దంపతుల కుమారుడు మారగాని జీవన్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆశ్రమంలో అనాధలకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు మిత్రులు కోండ్రు గోపీనాథ్ పాల్గొని అన్న వితరణ కార్యక్రమం చేశారు.

ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ... అన్నదానం పుణ్యకార్యమని ప్రతి ఒక్కరు ఇలా వారి వారి గృహాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలాంటి ఆశ్రమాలలో ఉన్న అనాధలకు వృద్ధులకు అన్న వితరణ కార్యక్రమం చేసి వారికి అండగా నిలిచి వారి ఆకలి తీర్చాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆశ్రమాలకు వారి వారికి అవకాశం ఉన్నంత వరకు ఆర్దిక సహకారాన్ని అందించి తోడ్పాటునందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.