04-08-2025 11:58:57 AM
మానుకోట వాసులకు తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ కు చెందిన తాపీ మేస్త్రి పని చేసే సుమారు 20 మంది శ్రీశైలం(Srisailam) వెళ్ళి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తున్న మినీ బస్ ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో సూర్యాపేట(Suryapet) సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.