30-10-2025 08:22:35 PM
ఎన్ఆర్ఐ దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి
నకిరేకల్ (విజయక్రాంతి): ఎంత సేవ చేసిన ఏమిచ్చిన జన్మనిచ్చిన ఊరు ఋణం తీర్చుకోలేమని మునిపంపుల ఉచిత కంటి పొర చికిత్స శిభిరం నిర్వాహకులు దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి (ఎన్ఆర్ఐ) అన్నారు. రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి రాంరెడ్డి జ్ఞాపకార్థం భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో శంకర నేత్రలయ చెన్నై డాక్టర్లతో 22వ తేదీ నుండి ప్రారంభమైన ఉచిత కంటిపొర చికిత్స శిభిరం గురువారం రోజు ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి పొర చికిత్స శిభిరంలో మొత్తం 2560 మంది ఒపీ నమోదు చేసుకోగా 2119 మందికి ఉచిత కంటి అద్దాల పంపిణి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
122మందికి కంటి ఆపరేషన్ లు నిర్వహించగా, 211మందిని చెన్నై లో శంకర నెత్రాలాయకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. జన్మనిచ్చిన ఊరు ఋణం తీర్చుకోవడం కోసమే ఈ మహాత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు .ఊరి కోసం భవిష్యత్తులో సహాయ సహకారాలు అందిస్తాన్నాని ఆయన తెలిపారు. చికిత్స శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలకు, నిర్వహణ కోసం అహర్నిశలు కృషిచేసినవాలంటీర్లుకు,వివిధ యువజన సంఘాలు, అఖిల పక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కో -ఆర్డినేటర్ తొలుపునూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి సావిత్రమ్మ, దేవిరెడ్డి పద్మ, సమన్వయ కర్తలు బొడ్డుపల్లి వెంకటేశం,గాదెశోభారాణి,శంకర నేత్రలయ కోఆర్డినేటర్ భాను ప్రకాష్,అఖిల పక్ష నాయకులు మన్నెంపద్మారెడ్డి, తాళ్లపల్లి జితేందర్, కట్ట యాదయ్య, గంటెపాక శివకుమార్, ఉయ్యాల నర్సింహా,ఉడుతల శ్రీనివాస్,తొలుపునూరి శ్రీనివాస్, గాదె కృష్ణ,బూడిద బిక్షం,చింత గిరి బాబు, తుర్కపల్లి నరేష్, యాదాసు అరుణ్,అజయ్,బత్తిని సందీప్ తదితరులు పాల్గొన్నారు.