23-09-2025 08:10:46 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్ 2.85 కోట్లు మంజూరు చేశారు ఉప్పల్ లోని శ్రీనగర్ కృష్ణారెడ్డి నగర్ లోని 550 మీటర్ స్టాంప్ వాటర్ డియిన్ నిర్మాణానికి ఈ నిధులు కేటాయించారు. సాయి నగర్ ఆర్చ్ నుండి టిఎఫ్ఐఆర్ వరకు కృష్ణానగర్ రోడ్ నెంబర్ 1.2 కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని అంచనాల రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కమిషనర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.