01-09-2025 10:52:12 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో భారీ వర్షాలకు, వరద నీరు చేరి గృహాలు మునిగిన కుటుంబాలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవతో మంత్రి సీతక్క షబ్బీర్ పంపిన నివేదిక ఆధారంగా నిధులు మంజూరు అయ్యాయి. కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో 45 కుటుంబాలకు, కౌండిన్య కాలనీలో 22 కుటుంబాలకు, మొత్తం 67 ఇండ్ల మరమ్మతుకు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం తరఫున 11,500 వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
కామారెడ్డి పట్టణంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు తక్షణ సహాయం కింద 67 కుటుంబాలకు 4000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో దాదాపు 60 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. వారికి కూడా 4000 చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాసనమండలి కమిటీ, ప్రభుత్వ అధికారులు సర్వే చేసి పూర్తి వివరాలు పంపించిన తర్వాత నష్టపోయిన కుటుంబాలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి వారి కుటుంబాలను ఆదుకుంటామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.