05-09-2025 07:25:24 PM
సిద్దిపేట రూరల్,(విజయక్రాంతి): సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెల్లి గ్రామం రెడ్డి సంఘం అధ్యక్షులుగా గడీల రాజి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆర్. మాధవ రెడ్డి, సిహెచ్ మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరసింహారెడ్డి, కార్యదర్శులుగా కమలాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, కోశాధికారిగా మల్లారెడ్డి, సలహాదారుడుగా భైరవరెడ్డి, సంజీవరెడ్డిలుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.