05-09-2025 11:37:33 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి గణేష్ శోభాయాత్ర భాగ్య నగరంలో జరిగే గణేష్ శోభయాత్రను తలపిస్తుంది. 250కి పైగా గణేష్ విగ్రహాలు శోభయాత్రలు పాల్గొంటున్నాయి. సిరిసిల్ల రోడ్ లోని ఇందిరా చౌక్ వద్ద యువజన సమాఖ్య గణేష్ విగ్రహానీకి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కామారెడ్డి ఆర్డిఓ వీణ,మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, యువజన సమాఖ్య అధ్యక్షుడు రవీందర్ గౌడ్, కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్ర ప్రారంభించారు. ఈ శోభాయాత్ర హైదరాబాద్ భాగ్యనగరంలో జరిగే విధంగా కామారెడ్డిలో గణేష్ శోభయాత్రలు నిర్వహిస్తారు.
కామారెడ్డికి చుట్టుపక్కల జిల్లాలకు చెందిన భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శోభయాత్రలో పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహరాజ్ కి అంటూ భక్తులు జయ జయ జ్వనాల ధ్వనాల మధ్య గణనాథుల శోభయాత్ర ను రాత్రి 9:30 గంటలకు ప్రారంభించారు. స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ్ వాలంటీర్లు, షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా పులిహోర, నీరు భక్తులకు అందించారు. గణనాథులను సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్, జే పిఎన్ రోడ్డు, వీక్లీ మార్కెట్ రోడ్, మీది నుంచి పాంచరస్తా, గోపాల స్వామి రోడ్డు, పెద్ద బజార్, కమాన్ రోడ్, మీదుగా నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ రోడ్, మీదుగా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో శనివారం సాయంత్రం గణనాథులను నిమజ్జనం నిర్వహిస్తారు.
పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు 300 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడ్లూరు ఎల్లా రెడ్డి పెద్ద చెరువు వద్ద ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు గజయితగాలను, రేస్క్యూ టీం ను, జెసిబిలను, మున్సిపల్, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది బందోబస్తు పాటు వినాయక నిమజ్జనం కోసం సీరియల్ ప్రకారం నిమజ్జనం చేసేందుకు సేవలందిస్తున్నారు. వినాయక మండపాల నిర్వాహకులు డిజె సౌండ్, బ్యాండ్ మేళాలతో గణనాథులను ఘనంగా గంగమ్మ చెంతకు పంపేందుకు తరలి వెళుతున్నారు. డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు జరిగే గణేష్ శోభాయాత్ర శోభాయామానంగా విద్యుత్ లైట్ అలంకరణతో గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్నారు.