17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కనుల పండువగా గాయత్రి వార్షికోత్సవం

26-01-2026 12:36 AM

మణికొండ, జనవరి 25 (విజయక్రాంతి) : విద్యారంగంలో 14 ఏళ్లుగా శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, దశాబ్ద కాలంగా ఎంతోమంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇతర ప్రముఖులు కొనియాడారు. శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు తారామతి బారాదరిలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో స్థిరపడటం సంతోషకరమని, భవిష్యత్తులోనూ పాఠశాల ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవంలో పాఠశాల చైర్మన్ కొంపల్లి మధుసూధన్, సీఈఓ సర్వేశ్వరరావు, డైరెక్టర్ సమీయుద్దీన్, ప్రిన్సిపాల్ రచన, కాంగ్రెస్ నేత రామకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్లు మల్లేష్, వేణు, నేత అశోక్ యాదవ్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.