6 July, 2026 | 1:13 PM

Breaking News

కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •  

సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ మెడికల్ కంపెనీ భేటీ

05-09-2025 02:06 PM

హైదరాబాద్: జర్మనీకి చెందిన బీబిగ్ మెడికల్ కంపెనీ(BEBIG Medical Company) సీఈఓ జార్జ్ చాన్, ఒక ప్రతినిధి బృందంతో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభానికి జర్మన్ కంపెనీ ఆసక్తి చూపింది. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. అనువైన స్థలం, ఇతర అంశాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్ మెంట్(Medical Equipment), క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.