23 May, 2026 | 7:07 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

టీజీపీఏ ఉమ్మడి జిల్లాల మీడియా ప్రతినిధిగా కాదేపురం గంగన్న..

07-09-2025 07:51 PM

బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(Telangana Gurukul Parents Association) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీడియా ప్రతినిధిగా బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కాదేపురం గంగన్నను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీపీఏ కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కాదేపురం గంగన్న మాట్లాడుతూ.. జిల్లా కమిటీ ఎన్నికలో భాగంగా తనపై నమ్మకం ఉంచి తనను ఉమ్మడి జిల్లా మీడియా ప్రతినిధిగా ఎన్నుకోవడం చాలా సంతోషమని, ఉమ్మడి జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలల్లో గల సమస్యలను అదేవిదంగా విద్యార్థుల చదువు పట్ల కృషి చేస్తానని అన్నారు. తనను ఉమ్మడి జిల్లా మీడియా ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రతీ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలను తెలిపారు.