16-12-2025 05:15:18 PM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. డీలిమిటేషన్ గెజిట్ పేపర్లను చింపి విసిరేసిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసన మధ్య వేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సభను వాయిదా వేశారు. డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలను ప్రభుత్వానికి పంపాలని మేయర్ ఆదేశించారు. కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ విడుదల చేసిన మ్యాప్ తప్పులతడక అని, డివిజన్ చోరీ జరిగిందంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.