17 April, 2026 | 9:36 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

జీఎంఏ ఇన్ ఫ్రా డెవలపర్స్ కార్యాలయం ప్రారంభం

01-05-2025 12:00 AM

మై హోమ్ గ్రూప్స్ డైరెక్టర్ జూపల్లి వినోద్ రావు

కోదాడ ఏప్రిల్ 30: వినియోగదారుల నమ్మకానికి అనుగుణంగా నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి నిర్మాణరంగంలో రాణించాలని మై హోమ్ గ్రూప్స్ డైరెక్టర్ జూపల్లి వినోద్‌రావు తెలిపారు. బుధవారం కోదాడ పట్టణం ప్రమీల టవర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎంఏ ఇన్ ఫ్రా డెవలపర్స్ కార్యాలయాన్ని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, సంస్థ ఎండి జాకీర్ హుస్సేన్ తో కలిసి వారు ప్రారంభించారు.

అనంతరం కార్యాలయంలో సంస్థ  బ్రోచర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. గుడిబండ రోడ్డు లో గల తమ కార్యాలయంలో జిఎంఏ సంస్థ వారు నూతన భవనాన్ని పూర్తి నాణ్యతతో నిర్మించి సకాలంలో అందించినందుకు గాను వారికి అభినందనలు తెలిపారు. సంస్థ ఎండి జాకీర్ హుస్సేన్, అల్తాఫ్ హుస్సేన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌశిక్, రాజశేఖర్, అశోక్, మహమ్మద్ ఎజాజ్ కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అజీమ్ బాయ్ ,బాబురావు పాల్గొన్నారు.