13 June, 2026 | 2:08 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

గొలనుకొండ సర్పంచ్‌కు ఘనంగా సన్మానం

31-12-2025 01:49 AM

ఆలేరు, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఆలేరు మండలంలోని గొలనుకొండ సర్పంచ్, ఉప సర్పంచులు ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏ. జి. పి. ఏ. భీమగాని హరిబాబు మాట్లాడుతూ సర్పంచ్ గా ఇందూరి యాదిరెడ్డి, ఉప సర్పంచ్ గా యాదగిరి గెలుపొందిన వార్డ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు, ప్రజా ప్రతినిధులుగా గొలనుకొండ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఆలేరు  నియోజకవర్గంలో నిలబెట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులతో పాటు పుట్టిన ఊరుకు సేవ చేయడం చాలా అదృష్టం ఉండాలన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో మిమ్మల్ని గెలిపించారని వారి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో గ్రామపంచాయతీ పయనించాలన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాకీ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ రాం మల్లయ్య, రాములు, బాకీ అశోక్ మరియు గ్రామ కార్యదర్శి, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.