25 March, 2026 | 3:05 PM

Breaking News

పొంచి ఉన్న ప్రమాదం   •   గురుకుల ప్రవేశ పరీక్షలో శ్రీవిద్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం   •   బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం   •   పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •  

రూ.71,000 దాటిన బంగారం

14-08-2024 12:05 AM

ఒక్కరోజులో రూ.1,040 పెరిగిన తులం ధర

హైదరాబాద్, ఆగస్టు 13: శ్రావణ మాసం వచ్చినంతనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ.1,000పైగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లో  పుత్తడి కొత్త రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం ధర  రూ. 1,040 పెరిగి రూ.71,620  వద్దకు చేరింది. మూడు వారాల క్రితం బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో రూ.68,000 స్థాయికి దిగిన పుత్తడి తిరిగి పదేపదే రూ.70,000 స్థాయికి పెరిగి మళ్లీ తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులుగా ఈ స్థాయితో పాటు రూ.71,000 స్థాయిని సైతం దాటేసింది.

తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.950 మేర పెరిగి రూ.65,650వద్దకు చేరింది. ప్రపంచ మార్కెట్లో  ఔన్సు బంగారం ధర 2,504 డాలర్ల రికార్డుస్థాయికి పెరిగిపోయింది. పపంచ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా వెండి, బంగారాల ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు తెలిపారు. ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి జరపవచ్చన్న భయాలతో సురక్షిత పెట్టుబడిగా పరిగణించే పుత్తడిలోకి ఇన్వెస్టర్లు నిధుల్ని మళ్లిస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు.