20-12-2025 10:40:55 AM
బాలానగర్ : బాలానగర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఎంపిసి రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అభి నాయక్ డిసెంబర్ 10 తేదీ నుండి 15 వరకు లక్నోలో జరిగిన ఎస్జీఎఫ్ ఐ స్కూల్ గేమ్ జాతీయ మీట్ లో లాంగ్ జంప్ ఈవెంట్ లో 6.65 మీటర్ల దూరంలో దూకి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అభినాయక్ ను అభినందించారు.