23-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బుజ్జు పటేల్ అన్నారు. గురువారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జు పటేల్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు అంకితం అవ్వాలని అని అన్నారు.
మందులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్, వైస్ చైర్మన్ మజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దయానంద్, పట్టణాధ్యక్షులు నిమ్మల రమేష్, సూపరిడెంట్ వంశీ తదితరులు ఉన్నారు.