calender_icon.png 6 July, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి రెవెన్యూ గ్రామానికో జీపీవో

06-07-2025 12:18:34 AM

- వీఆర్‌వో, వీఆర్‌ఏలకు మరో అవకాశం

- రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి (జీపీవో )ని నియమిస్తున్నామని రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో వీఆర్‌వో, వీఆర్‌ఏగా పనిచేసినవారికి జీపీవోలుగా అవకాశం కల్పించేందుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించామని స్పష్టం చేశా రు. ఇందులో 3,454 మంది అర్హత సాధించారని తెలిపారు.

రెవెన్యూ ఉద్యోగ సంఘా ల విజ్ఞప్తి మేరకు వీఆర్‌వో, వీఆర్‌ఏలకు మరో అవకాశం కల్పించి ఇందుకు సంబంధించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్‌తో కలిసి రెవెన్యూ సంఘాలతో సమావేశమై ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించటంపై సుదీర్ఘంగా చర్చించా రు.

గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవ స్థను రద్దు చేసి సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందన్నారు. రాష్ర్టంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువచేయడానికి ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకొని గ్రామ పాలనా అధికారుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.

అందరి సహకారంతో రెవెన్యూ సదస్సులు విజయవంత మయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. భూభారతి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరేలా చట్టం అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. పదవులు శాశ్వతం కాదని.. పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న సంస్కరణలు విధానపరమైన నిర్ణయాలు పదిమందికి మేలు జరిగేలా ఉండాలన్నారు.

తెలంగాణ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లచ్చిరెడ్డి, కే రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షుడు కే రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ రామ్‌రెడ్డి, భిక్షం, ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు పీ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు నిరంజన్, రాష్ర్ట నాయకులు రమణారెడ్డి, రామకృష్ణా రెడ్డి, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సీసీఎల్‌ఏ యూనిట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ రాం బాబు, కృష్ణచైతన్య, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ ఉపేందర్‌రావు, లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.