13-06-2025 12:02:05 AM
అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 12 (విజయక్రాంతి):రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ మండలం అప్పపెల్లి గ్రామంలో ఏర్పా టు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేం ద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని, తూకం వేయని ధాన్యాన్ని టార్పాలిన్ కవర్లు కప్పి రక్షించాలని తెలిపా రు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యం లో ధాన్యం తడిసి నష్టపోకుండా రక్షణ చర్య లు చేపట్టాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు, రైతులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వినోద్, కొనుగోలు కేంద్రం నిర్వహకులు, రైతులు పాల్గొన్నారు.