13-11-2025 05:30:07 PM
- నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యాలి
- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
మునుగోడు (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జాప్యం చెయ్యకుండా నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం మునుగోడు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు పరిశీలించి మాట్లాడారు.17 శాతం తేమతో, తాలు ,తరుగు లేకుండా,నాణ్యత ప్రమాణలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, జాప్యం చేయొద్దని, వర్షం కూడా లేనందున తేమను పరిశీలించి రైతులకు మేలు జరిగే విధంగా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
పి పి సిసెంటర్లో రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగినారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఇబ్బంది లేవని చెప్పారు. పత్తి రైతులు 12 శాతం వరకు తేమ వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలని అప్పుడు పత్తి కొనుగోలు లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా సహకార అధికారి పత్య నాయక్, ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ నరేష్, సెక్రెటరీ సుఖేందర్ ఉన్నారు.