17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భారీ వర్షంతో కొట్టుకుపోయిన ధాన్యం

02-05-2025 07:39 PM

మహాదేవపూర్,(విజయక్రాంతి): అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎర్ర చెరువు లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొట్టుకొని పోవడం జరిగింది. శుక్రవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు బోరుణ విలపించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కొరకు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రారంభించి మిల్లులకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కొనుగోలు ప్రక్రియలో తాలూ, తరుగు, తడిసిన ధాన్యం, పేరుతో రైతులను ఇబ్బంది చేయద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ఇంచార్జ్ లే పూర్తి బాధ్యత వహించాలని ధాన్యం కొనుగోలు ట్యాబ్ ఎంట్రీలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో తార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మాయంకా సింగ్, డీఎస్ఓ శ్రీనాథ్, మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, మైనార్టీ సెల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అశ్రర్ ఖురేషి,  బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ  రైతులు  పాల్గొన్నారు.