2 August, 2026 | 8:58 AM

ఆలయం షెడ్ నిర్మాణానికి భూమి పూజ

14-09-2025 06:36 PM

నంగునూరు: మండల కేంద్రంలోని పురాతన అభయాంజనేయ స్వామి ఆలయానికి షెడ్డు నిర్మాణంకూ తెలంగాణ భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు ఘాదగోని చక్రధర్ గౌడ్ భూమి పూజ చేశారు.ఆలయ కమిటీ సభ్యులు గోనేపల్లి శివప్రసాద్ విజ్ఞప్తికి మేరకు నిర్మాణానికి శ్రీకారం చుట్టమని,ప్రజలకు దైవ కార్యక్రమాలకు సేవ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని,తృప్తిని ఇస్తుందని చక్రధర్ గౌడ్ అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆయన తెలిపారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, షెడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.