16-12-2024 05:55:53 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆది, సోమవారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంతరనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా 38 పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లాలో 13,466 మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా, మొదటి రోజు ఆదివారం రెండు సెషన్లలో పరీక్షకు 12,572 మంది హాజరయ్యారు. ఇక రెండవ రోజు సోమవారం రెండు సెషన్లలో 12343 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల సెంట్ మేరీస్ హై స్కూల్లో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.