2 July, 2026 | 10:48 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. హాజరైన తెలుగురాష్ట్రాల మంత్రులు

03-09-2025 12:19 PM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్(GST Council Meeting 2025) సమావేశం కొనసాగుతోంది. జీఎస్టీ కౌన్సిల్ భేటీకి తెలుగు రాష్ట్రాల ఆర్థికమంత్రులు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. జీఎస్టీ శ్లాబ్ లలో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబ్ లను కౌన్సిల్ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు శ్లాబుల్లోని ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం శ్లాబ్ లోకి మార్చే అవకాశం ఉంది. పొగాకు లగ్జరీ ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ కొనసాగించాలని కౌన్సిక్(GST Council Meeting) కు సూచనలు చేశారు. పలు రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ ఉపసంఘం ఇప్పటికే సూచనలు చేసింది. నిర్ణయాలకు ఆమోదం వస్తే ఆటోమెబైల్ రంగంలో కీలక మార్పులకు అవకాశముంది. హైబ్రిడ్ కార్లు, మోటార్ సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఉపసంఘం సూచించింది. పాలు, పాల ఉత్పత్తులపై, జీవిత బీమాపై జీఎస్టీ శ్లాబ్ ల్లో మార్పులకు అవకాశముంది. సుమారు 500 ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకోనుంది. జీవితబీమాపై పన్ను పూర్తిగా ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. సమావేశం తొలి భాగంలోనే ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.