21-06-2025 08:44:54 PM
కరీంనగర్ (విజయక్రాంతి): వికాస తరంగణి, ప్రజ్ఞ వికాస్ ఆధ్వర్యంలో నగరంలోని మహాత్మ జ్యోతిరావు పూలే మైదానంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) ఘనంగా నిర్వహించారు. చిన్న జీయర్ స్వామివారి మంగళ శాసనాలతో దేవనాథ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో వికాస్ తరంగణి, ప్రజ్ఞా వికాస్ అనుబంధ సంఘాల బాధ్యులు, పాఠశాలల, కళాశాల విద్యార్థులు, ప్రజలు యోగాసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, వికాస తరంగిణి జోనల్ అధ్యక్షులు కె గౌతమ్ రావు, యాద కిషన్, సిరికొండ వెంకటేశం, రవీందర్ రావు, ప్రభాకర్ రావు, కర్ణాకర్ రావు, జగన్నత రావు, ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్వర్, వంశిధర్ రావు,పచ్చునూరి సురేందర్,చాట్ల శ్రీధర్, మునిందర్, తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.