26-05-2025 05:20:29 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం మళ్లీ మొదలైంది. సోమవారం ఉదయం నుంచి చల్లగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒకసారి వాన పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. కొన్ని ప్రాంతాల్లో తేలిపాటి జల్లులు పడుతుండగా.. మిగతా ఏరియాల్లో వాతావరణం చల్లగా ఉంది.
దేశానికి అత్యధికంగా వర్షాపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళ రాష్ట్రాన్ని తాకాయి. సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నైరుతి రుతుపవనాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తాకాయి. రాష్ట్రంలోని మహబూబ్ నగర్ వరకు రుతుపవనాలు విస్తరించడంతో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.