calender_icon.png 8 June, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్

26-05-2025 05:52:32 PM

ఖమ్మం,(విజయక్రాంతి): తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(Telangana Anti-Corruption Department) అధికారులు తెలంగాణలో తమ ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. తాజాగా ఖమ్మం రూరల్‌ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం(Khammam Rural Sub-Registrar Office)లో సబ్-రిజిస్ట్రార్ అరుణ(Khammam Rural Sub -Registrar Aruna), డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్(Document Writer Puchakayala Venkatesh) సోమవారం ఏసీబీ(ACB)కి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్(ACB DSP Y. Ramesh) తెలిపిన వివరాల ప్రకారం...  ఖమ్మం గ్రామీణ మండలం, తల్లంపాడు గ్రామంలోని ఓ వ్యక్తి, అతని భార్య సర్వే నంబర్ 713/A2లో సంయుక్తంగా కలిగి ఉన్న 2,700 చదరపు గజాల ఆస్తిని తమ కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేయడానికి గత కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలాన్ తీశారు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్-రిజిస్ట్రార్ అరుణ రూ.50,000 లంచం డిమాండ్ చేసి, రూ.30,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఈ విషయాన్ని బాధితులు ఏసీబీ అధికారులకు వెల్లడించారు. దీంతో ముందస్తు పతకం ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు  సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ ఆవరణలో ఫిర్యాదుదారుడి కారులో కూర్చుని డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ద్వారా రూ.30,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేష్ నుండి లంచంగా తీసుకున్న రూ.30,000 మొత్తాన్ని స్వాధీనం చేసుకున్ని, అతని రెండు చేతుల వేళ్లు రసాయన పరీక్షలో పరిక్షించగా పాజిటివ్‌గా వచ్చింది. ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేసి వరంగల్‌లోని ఎసీబీ కేసుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. వారిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు.ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు చట్ట ప్రకారం చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని పేర్కొన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటామని, టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు.