14-05-2025 10:25:51 AM
మణుగూరు,(విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం రానున్న ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి పిలపాక నియోజకవర్గం పరిధిలోని మణుగూరులో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అల్ప పీడన ప్రభావం కారణంగా పినపాక నియోజాక వర్గం వ్యాప్తంగా కమ్ముకున్న మబ్బులు, ఈదురు గాలులతో, కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయి రైతులు జాగ్రత్త ఉండాలని వాతావరణ శాఖ ఎప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.