16 April, 2026 | 10:50 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నాంపల్లి సీబీఐ కోర్టులో గాలి జనార్దన్ మరో పిటిషన్

14-05-2025 12:39 PM

హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టు(Nampally CBI Court)లో గాలి జనార్దన్ రెడ్డి మరో  పిటిషన్ వేశాడు. చంచల్ గూడ జైలులో అదనపు సౌకర్యాలు కల్పించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining case)లో గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) జైలులో ఉన్నారు. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. గాలి జనార్దన్ పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. మే 6న, కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బీవీ శ్రీనివాస రెడ్డి, గనుల ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్ధన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెహఫుజ్ అలీ ఖాన్ సహా నిందితులను అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో దోషులుగా తేల్చి కోర్టు తీర్పు ఇచ్చింది. వారిద్దరినీ దోషులుగా తేల్చి ఒక్కొక్కరికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించింది.