24 June, 2026 | 2:54 AM

ధ్రువీకరించిన విత్తనాలతో అధిక దిగుబడులు

24-06-2026 01:58 AM

ఏడీఏ శ్రీపాల్

మహాదేవపూర్ జూన్ 23 (విజయక్రాంతి):  రైతులు ఖరీఫ్ సీజన్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడి   సాధించాలని మహాదేవపూర్ వ్యవసాయ సంచాలకులు శ్రీ పాల్ అన్నారు. మంగళవారం మండలంలోని  మహాదేవపూర్, సూరారం రైతు వేదికలలో 2026-27సంవత్సరం గాను మహాదేవపూర్ రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన సీడ్ మేళా కార్యక్రమానికి మహాదేవపూర్ సర్పంచ్ హసీనా భాను పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏడీఏ శ్రీపాల్ మాట్లాడుతూ నానో యూరియా నానో డిఏపి ఎరువుల వినియోగం పై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించడంతోపాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బోల్లపెల్లి శ్రీజ.ఏఈవో ధర్మేందర్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.