ధ్రువీకరించిన విత్తనాలతో అధిక దిగుబడులు
ఏడీఏ శ్రీపాల్
మహాదేవపూర్ జూన్ 23 (విజయక్రాంతి): రైతులు ఖరీఫ్ సీజన్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడి సాధించాలని మహాదేవపూర్ వ్యవసాయ సంచాలకులు శ్రీ పాల్ అన్నారు. మంగళవారం మండలంలోని మహాదేవపూర్, సూరారం రైతు వేదికలలో 2026-27సంవత్సరం గాను మహాదేవపూర్ రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన సీడ్ మేళా కార్యక్రమానికి మహాదేవపూర్ సర్పంచ్ హసీనా భాను పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏడీఏ శ్రీపాల్ మాట్లాడుతూ నానో యూరియా నానో డిఏపి ఎరువుల వినియోగం పై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించడంతోపాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బోల్లపెల్లి శ్రీజ.ఏఈవో ధర్మేందర్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






