1 May, 2026 | 3:14 AM

హోల్డర్ వివాదాస్పద క్యాచ్

01-05-2026 01:54 AM

అహ్మదాబాద్, ఏప్రిల్ 30 : గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌లో ఓ క్యాచ్ విషయంలో అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ కొట్టిన బంతిని.. బౌండరీ లైన్ వద్ద జేసన్ హోల్డర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. 

ఫలితంగా రజత్.. డగౌట్ వైపు నడిచాడు. అప్పటికే ఔట్ అయి డగౌట్‌లో కూర్చున్న విరాట్ కోహ్లీ.. బంతిని అందుకున్న తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకోకముందే హోల్డర్.. దాన్ని గ్రౌండ్‌కు తగిలించాడని వాదించాడు. రీప్లేలు చూడగా.. హోల్డర్ చేతిలో ఉండగానే.. బంతి గ్రౌండ్‌ను తాకినట్లు కనిపించింది. దీనిపై కోహ్లీ చాలా సేపు అంపైర్‌తో మాట్లాడాడు. అప్పటికే ఔట్ అని ప్రకటించడంతో రజత్ బౌండరీ లైన్ దాటాల్సి వచ్చింది.