22-12-2025 10:25:37 PM
అవగాహన సదస్సులో నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబల్లి
ఉప్పల్,(విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబలి అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హోలీ ఫెయిత్ స్కూల్ సైబర్ అవగాహన సదస్సును సోమవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మైబల్లి మాట్లాడుతూ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటూ కొందరు కేటుగాళ్లు వివిధ మాయమాటలతో బురిడీ కొట్టించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.
విద్యార్థులు నేరాల పట్ల అవగాహన ఎంతో అవసరమని వాట్సప్ టెలిగ్రామ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. పోలీసుల పనితీరు సోషల్ మీడియా మోసాలు మహిళల భద్రత పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొదించేలాగా తెల్చపరిచారు . పోలీసుల సైబర్ హెల్ప్ లు ఉపయోగించుకొని మీ చుట్టుపక్క ఏదైనా నేరం జరిగినప్పుడు వెంబటే పోలీసుకు తెలియజేయాలని ఆయన సూచించారు. అనంతరం మార్క ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సైబర్ అవేర్నెస్ పిసి అనిల్ సిబ్బంది నవీన్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు