15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లంచం తీసుకుంటూ పట్టుబడిన హౌసింగ్ ఏఈ

28-01-2026 12:00 AM
  1. రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
  2. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో ఘటన

ఆదిలాబాద్/ ఉట్నూర్, జనవ రి 27 (విజయక్రాంతి): బిల్లుల మంజూరులో అవినీతికి పాల్పడుతున్న అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో గృహ నిర్మాణ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న దుర్గం శ్రీకాంత్... మండల కేంద్రంలోని ఓ గిరిజన లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణంలో రూప్ లెవెల్ వరకు బిల్లు ఇవ్వాలని ఇంటి లబ్ధిదారులు సదరు అధికారులను కోరారు. బిల్లు మంజూరుకు రూ.20 వేలు ఇవ్వాలని ఏఈ శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

తన వద్ద ఇంత డబ్బు లేదని, చివరకు రూ.10 వేలు కు అధికారి ఒప్పుకున్నాడు. అయితే ఆ పది వేలు సైతం తన వద్ద లేకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లబ్ధిదారు నుంచి రూ. 10 వేల లంచం తీసు కుంటుండగా ఏఈ శ్రీకాం త్‌ను ఏసీబీ డీఎస్పీ మధు తన సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితున్ని కరీంనగర్ లోని ప్రత్యేక కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.