9 July, 2026 | 1:23 AM

గచ్చిబౌలి ఎఫ్‌సీఐ లేఅవుట్‌లో అక్రమ కబ్జాలపై హైడ్రా- సీఎంసీ కమిషనర్ల తనిఖీ

09-07-2026 12:23 AM

శేరిలింగంపల్లి, జూలై 8 (విజయక్రాంతి): గచ్చిబౌలి ఎఫ్సీఐ లేఅవుట్లోని రోడ్లు, పార్కుల అక్రమ కబ్జాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిఎంసీ కమిషనర్ సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత ప్లాట్ ఓనర్లతో కలిసి 40, 25 అడుగుల రోడ్లు మరియు పార్కు స్థలాలను తనిఖీ చేశారు.

1981లో ఏర్పాటైన ఈ లేఅవుట్ను సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాడని బాధితులు ఆరోపించారు. హైకోర్టు స్టేటస్ క్వో ఆదేశాలను ఉల్లంఘించి మళ్లీ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దౌర్జన్య నిర్మాణాలు చేపడుతున్నారు. చట్టపరమైన చర్యలు చేపడుతామని,రోడ్లు,ఓపెన్ స్పేస్లను హైడ్రా కాపాడుతుందని హెచ్చరించారు.