01-06-2025 12:16:49 AM
--యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశం
మలక్ పేట , మే 31( విజయ్ క్రాంతి): మలక్పేట్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు వల్ల తలెత్తిన ట్రాఫిక్ సమస్యల ను నివారించేందుకు అధికారులు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు మలక్ పేట రైల్వే స్టేషన్ వెంబడి మలక్ పేట నల్గొండ చౌరస్తా వరకు శుక్రవారం నుంచి మురుగునీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తుండడంతో ఇబ్బందికర పరిస్తితులు తలెత్తాయి.
మురుగునీరు రోడ్లపై పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి ట్రాఫిక్ జామ్ అయిన సంఘటన విదితమే. మలక్ పేట్ రైల్వే స్టేషన్ రోడ్డు వెంబడి నల్గొండ చౌరస్తా వరకు రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, జలమండలి ఇడి మయాంక్ మిట్టల్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తదితర ఉన్నతాధికారులతో కలిసి పర్యటిం చారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఈ సమస్య తలెత్తుతోందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. మురుగునీరును మూసిలో కలిపే జంక్షన్ లైన్ దెబ్బ తినడంతో ఈ సమస్య తలెత్తుతుందని స్థానికులతో పాటు అధికారులు వివరించడంతో వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిష్కార మార్గాల గురించి అక్కడే చర్చించారు.
--ప్రయాణికులు సహకరించాలి: ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు
మలక్ పేటలో మురుగునిరు రోడ్లపై పొంగి ప్రవహిస్తుండడంతో మరమ్మతు పనులను చేపట్టడం జరిగిందని, చాదర్ ఘాట్ నుంచి నుంచి మలక్ పేట్ నల్గొండ చౌరస్తా వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని ట్రాఫిక్ డిసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. మరమత్తు పనులు పూర్తి అయ్యేవరకు చాదర్ ఘాట్ నుంచి నుంచి దిల్ షుక్ నగర్ వైపు వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు.
అంతర్గత రోడ్లలో ట్రాఫిక్ జాం
మలక్పేట్ రైల్వే స్టేషన్ మురుగునీరు ప్రవహిస్తుండడంతో రెండు వైపులా నుంచి వచ్చే వాహన దారులు ప్రత్యామ్నాయ మా ర్గాల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా రు. దీంతో మలక్పేట్ లోని మున్సిపల్ కాలనీ రేస్ కోర్స్ రోడ్, ఆజంపూర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ , చాతరగతి తదితర అంతర్గత కాలనీలలో వాహ నాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఎన్నడు లేని విధంగా వాహనాలు వరుసగా రావడంతో ఆయా ప్రాంతాలలోని కాలనీలలో పూర్తిగా ట్రాఫిక్ జామ్యులకు ఉంది. స్థానికంగా నివాసం ఉండే వాసులు వాహనాల మోత తో, రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు.