01-06-2025 12:17:18 AM
800 ఐటీ కంపెనీల ప్రతినిధుల హాజరు
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్ అడ్రస్ కన్వెన్షన్లో నిర్వహించిన 11వ జాతీయ ఎన్ఈఓఎఫ్ఎం (NEO-FM) సమ్మిట్ విజయవంతంగా జరిగింది. ఫెసిలిటీ మేనేజ్మెంట్ రంగంలో సుస్థిరత, ఆవిష్కరణలు, భవిష్యత్ టెక్నాలజీలపై లోతైన చర్చలు జరిగాయి. 800 కంపెనీలు పాల్గొన్న ఈ సమ్మిట్ భారతదేశంలోని ఐటీ రంగంలో ముఖ్యమైన సమావే శంగా నిలిచింది.
టీఎఫ్ఎంసీ అధ్యక్షుడు సత్యనారాయణ మాథలా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మిట్.. ఫెసిలిటీ మేనేజ్మెంట్ రంగం భవిష్యత్తులో ఏఐ, సస్టైనబిలిటీ ద్వారా ఎలా మారబోతుంది అనే అంశంపై లోతైన చర్చను అందించింది. ఈ సందర్భంగా, టీఎఫ్ఎంసీ, లీడరిషిప్ టీమ్తో మౌలిక సదుపాయాలపై సలహా కమిటీని ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిధులుగా ఐటీ/ఐటీఈఎస్ తెలంగాణ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎల్ అండ్ టీ మెట్రో రైలు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీ వరదరాజన్, కిమ్స్ సన్షైన్ డైరెక్టర్ డాక్టర్ ఆదర్శ్, శ్రీకాంత్ సిన్హా తెలంగాణ టాస్క్ సీఈఓ, వినయ్ అగర్వాల్, వీపీ, టెక్ మహీంద్రా, అంజద్ ఖాన్ పఠాన్ వీపీ అండ్ సెంటర్ హెడ్, బోష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, అమోల్ గుప్తా టీటీఈసీ డిజిటల్ కంట్రీ హెడ్ పాల్గొన్నారు.
సమ్మిట్లో ఫ్రంట్లైన్ వారియర్లుగా ఉన్న టీజీఎస్ఆర్టీసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, ట్రాఫిక్ పోలీసులకు అవార్డుల ప్రాధానోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్లోని పలు ఐటి పార్కులు, కమ్యూనిటీలకు ఉత్తమ సస్టై నబుల్ పద్ధతుల కోసం గ్రీన్అవార్డులు ప్రదానం చేశారు. సామాజిక బాధ్యత, సమాజ సేవలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ బృందాలకు సోషల్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు.
ప్రముఖ అవార్డు గ్రహీతలలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్కు బెస్ట్ గ్రీనింగ్ ది ఫ్యూచర్ అవార్డు దక్కింది. అలాగే వివిధ రంగాలకు చెందిన పలు సంస్థలకు మొత్తం 42 అవార్డులు అందించారు.