01-06-2025 12:15:55 AM
పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): నిరుపేదల జోలికి వస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, ఎంతటి వారైనా సర్కార్ సహించబోదని పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ హనుమంతరావు హెచ్చరించారు. అసైన్డ్ భూములను కాజేసిన అక్రమార్కుల పనిపడతామని, బడా బాబుల చేతిలో ఉన్న భూములను సర్కార్ స్వాధీనం చేసుకుంటుందని తాజాగా రెవెన్యూ మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కీసర ప్రాంతంలో కొందరు దళితుల భూములను ఆక్రమించారని, దీంతో 120 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
పేదల భూముల్లో కొందరు వెంచర్లు వేశారని, వాటికి హెచ్ఎండీఏ నుంచి లే ఔ ట్ అనుమతులు రావడంపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల స్థానిక తహసీల్దార్ కూడా అవి పేదల భూములనే నిర్ధారించారని, సీఎం రేవంత్ చొరవ తీసుకుని ఆ భూములను తిరిగి పేదలకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.