30-06-2025 08:01:25 AM
హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కూకట్ పల్లిలో(Kukatpally) సయ్యద్ షాహెద్ అనే యువకుడి హత్య జరిగింది. వివేకానందనగర్ లోని వడ్డేపల్లి ఎన్ క్లేవ్ వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బోరబండకు చెందిన వాహిద్ పైల్వాన్ కుమారుడిని గుర్తుతెలియని దుండగులు చంపేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital Mortuary) మార్చురుకి తరలించారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.