calender_icon.png 29 June, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డిగూడలో పార్కు ఆక్రమణలను తొలగించిన హైడ్రా

29-06-2025 05:13:55 PM

1533 గజాల విస్తీర్ణంలో పార్కును అందుబాటులోకి తెచ్చిన హైడ్రా

పార్కు అందుబాటులోకి రావడంతో సాయి సారధినగర్ నివాసితుల ఆనందం

60 ఏళ్ల పోరాట ఫలితమంటూ స్థానికుల సంతోషం

హైదరాబాద్: మధురనగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పార్కు ఆక్రమణలను ఆదివారం హైడ్రా తొలగించింది. 1961వ సంవత్సరం నుంచి ఉన్న ఆక్రమణలను తొలగించి, పార్కు అభివృద్ధికి అవకాశం కల్పించింది. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టిన్నట్లు అధికారులు వెల్లడించారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు 1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో సాయి సారధినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. 1533 గజాల స్థలాన్ని పార్కుగా చూపించినట్టు నిర్ధారణ చేశారు. పార్కు స్థలంలో షెడ్డు వేసి ఖాళీ చేయకుండా ఆక్రమణలో నారాయణ ప్రసాద్ వారసులు  లేఔట్ వేశారు.   

వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఇంటి నంబర్ కూడా తెచ్చుకున్నట్టు వెల్లడించారు. ఈ లేఔట్లో 6 రోడ్లను అభివృద్ధి చేసి పార్కును మాత్రం ఖాళీ చేయించలేదని సాయి సారధి నగర్ నివాసితులు పలుమార్లు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినప్పటికి ప్రయోజనం లేకపోవడంతో హైడ్రాను ఆశ్రయించారు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలతో కలిసి పూర్తి స్థాయి విచారణ చేసిన హైడ్రా అధికారులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఇవాళ ఆక్రమణలను తొలగించారు. పార్కు స్థలంగా గుర్తించి ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డు అని అధికారులు పెట్టారు. దశాబ్దాల పోరాటం హైడ్రాతో రోజుల్లో పరిష్కారం అయ్యిందంటూ స్థానికుల హర్షం వ్యక్తంచేస్తూ, 60 ఏళ్ల పోరాట ఫలితమంటూ హైడ్రా అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.