10 April, 2026 | 7:25 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

మహారాష్ట్రకు పాకిన ‘ఐ లవ్ ముహమ్మద్’

30-09-2025 12:51 AM
  1. అహల్యానగర్‌లో గ్రాఫిటీ డిజైన్ వివాదం
  2. పోలీసుల లాఠీచార్జ్.. అదుపులో 30 మంది

ముంబై, సెప్టెంబర్ 29: ఉత్తరప్రదేశ్‌లో మొదలైన ‘ఐ లవ్ ముహమ్మద్’ వివాదం మహారాష్ట్రకూ పాకింది. ఆదివారం రాత్రి అహల్యానగర్ పరిధిలోని మిలివాడ రహదారిపై కనిపించిన గ్రాఫిటీ డిజైన్ రెండు వర్గాల మధ్య చిచ్చురాజేసింది. గ్రాఫిటీ ఫొ టోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోమవారం ఉదయం ఆ ప్రాంతం అట్టుడుకింది. వేలాది మంది ము స్లిం యువకులు అహిల్యానగర్- శంభాజీ హైవేను దిగ్బంధించి రాస్తారోకో చేపట్టారు.

తోఫ్‌ఖానా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రాఫిటీ వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకదశలో పోలీస్, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు రా ళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జి చేయా ల్సి వచ్చింది. పోలీసులు సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గ్రాఫిటీ డిజైన్ వేసిన వ్యక్తిని కూడా పో లీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తల వెనుక కు ట్ర ఉండవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దే వేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.