17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రెండుసార్లు గెలిస్తే సీఎం నేనే

18-10-2025 01:43 AM

 ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహబూబ్ నగర్, అక్టోబర్ 17(విజయక్రాంతి): మరో రెండుసార్లు గెలిపిస్తే  ముఖ్య మంత్రి నేనే అవుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలోని డీసీసీ ఎంపికకు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మె ల్యే సంభాషించారు. మంత్రులు ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే అభివృద్ధి ఆగ కుండా వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కోడంగల్‌కు వెళ్లి చూడం డి రూ 500 కోట్ల అభివృద్ధి పనులు అతివేగంగా జరుగుతున్నాయని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు నాపై ఉన్న నమ్మకంతో నన్ను గెలిపించారని వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తానని తెలియజేశారు. ప్రజల ఆశయాలను పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు శాయాశక్తులుగా కృషి చేస్తానన్నారు.