18-10-2025 01:42:57 AM
రామాయంపేట, అక్టోబర్ 17 : రామాయంపేటలోని మంజీర విద్యాలయంలో ముందస్తుగా దీపావళి సంబరాలను అంబరాన్నంటే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి మాట్లాడుతూ దీపావళి పర్వదినం గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవే భారతీయ పండుగలన్నారు. అనంతరం లక్ష్మీ పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పాఠశాలలో దీపావళి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండ్ జితేందర్ రెడ్డి వాసవి, ప్రిన్సిపల్ సురేష్ మౌనిక, సౌమ్య, మీనా శ్రీనిత, అనిల్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.