calender_icon.png 19 June, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపు తప్పితే ప్రాణాలు హరీ..!

19-06-2025 12:33:19 AM

బ్రిడ్జి దిమ్మలను నిర్మించండి సారూ..

తూప్రాన్, జూన్ 18 : అధికారుల అలసత్వం...కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణీకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది..కొన్ని నెలల క్రితం తూప్రాన్ మండల సమీపంలోని వెంకట రత్నాపూర్ వద్ద ప్రభుత్వ నిధులచే హల్దీ వాగుపై బ్రిడ్జి పనులను పూర్తి చేశారు. కానీ బ్రిడ్జికి ఇరువైపులా దిమ్మలను కట్టడం మరిచారు. ఈ నిర్లక్ష్యం వల్ల అదమరిచి ప్రయాణిస్తే మట్టుకు ప్రాణాలు నీటిలో హరించి పోయే విధంగా పరిస్థితి ఏర్పడింది.

వచ్చిపోయే వాహనదారులు గాని, బాటసారులు కానీ నిర్లక్ష్యపు ధోరణితో ప్రయాణిస్తే గనుక ప్రాణాలు వాగు నీటిలో పడి ప్రమాదం చోటు చేసుకునే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకట రత్నాపూర్ నుండి తూప్రాన్కు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. దీంతో గత ప్రభుత్వ హయాంలో ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు. కానీ నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా దిమ్మెలను కట్టడం మరిచారు. అధికారుల వైఫల్యమో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో కానీ ఇది ప్రయాణికులకు హానికరంగా తయారయింది.

వెంకటా పూర్ గ్రామస్తులు 70 శాతం వ్యవసాయ ఆధారితులుగా ఉండడం వల్ల వారి ట్రాక్టర్లు, ఇతర వాహనాలు రాత్రుల్లో బ్రిడ్జి గుండా ప్రయాణిస్తే మట్టుకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కొంచెం అదుపుతప్పితే వాగు నీటిలో పడి ప్రాణాలు కోల్పోవడం ఖాయమని గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు బ్రిడ్జికి ఇరువైపులా దిమ్మలను నిర్మించి సురక్షిత రాకపోకులకు మార్గాన్ని సుగమం చేయాలని గ్రామస్తులుకోరుతున్నారు.