19-06-2025 12:34:32 AM
ప్రభుత్వ భవనాలు, నిర్మాణాల నిర్వహణ భాధ్యతను అధికారులు విస్మరించొద్దు
పాల్వంచ ఏజెన్సీలోని ప్రతిగ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 18 (విజయ క్రాంతి) పాల్వంచ మండలంలోని ప్రతి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాప నలను చేశారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూఆవిష్కృతకంగా ఉన్న సమస్యలుకు శాశ్వత పరిష్కారం చూపించేంతవరకు విశ్రమించను అని స్పష్టం చేశారు. మండల పరిధిలోని కారేగట్టు, సత్యనారాయణపురం, ప్రభాత్ నగర్, తావిశలగూడెం, పాండురంగాపురం, పాత సూరారం, సోములగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో రూ1.46 కోట్ల తో సిసి రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పథకం నిర్మాణానికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
తనను నమ్మి అత్యధిక ఓటు వేసి గెలిపించి ప్రజలు ఆశించిన అభివృద్ధి సహకారం చేయటమే తన లక్ష్యమన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, పంచాయతీరాజ్ ,రామకృష్ణ, ఎలక్ట్రికల్ , సిపిఐ జిల్లా కార్యదర్శి , సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయి బాబా, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు ఉప్పుశెట్టి రాహుల్ పాల్గొన్నారు.