08-06-2025 12:25:06 AM
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): విద్యాసంస్థల యాజమాన్యాల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ నెల 10లోపు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (బీఏఎస్) బకాయిలు చెల్లించాలనే నిర్ణయానికి వచ్చింది. పెండింగ్ నిధుల్లో 50 శాతం తగ్గకుండా నిధులు విడుదలవుతాయని తెలిసింది. ఈనెల 6న ‘విజయక్రాంతి’ దినప త్రికలో ‘బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు నిధులు నాట్ అవైలబుల్’ అనే శీర్షికతో ప్రచురితమై న కథనానికి రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది.
అలాగే పెండింగ్ నిధులను విడుదల చేయకపోతే జూన్ 12 నుంచి తమ సూ ్కళ్లకు తాళాలు వేస్తామని యాజమాన్యాలు హెచ్చరించిన నేపథ్యంలోనూ ప్రభుత్వం దిగి వచ్చినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి మరీ విద్యాసంస్థల యాజమాన్యాలకు స్వయంగా కాల్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం.
సర్కార్ నిధులు విడుదల చేసేందుకు సిద్ధం గా ఉందని సదరు ఎమ్మెల్యే తెలిపినట్లు తెలిసింది. అలాగే ఆర్థికశాఖ నుంచి కూడా యాజమాన్యాలకు స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్లో సభ్యుడైన ఓ నేత తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 210 ప్రైవేట్ స్కూళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా 210 ప్రైవే ట్ స్కూళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కీం అమలవుతున్నది. వీటి పరిధిలో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన దాదాపు 25 వేల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. పథకం నిబంధనల ప్రకారం విద్యాసంస్థలే విద్యార్థులకు ఉచితం గా విద్యా, వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే.. ఆ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే స్కూళ్లకు చెల్లిస్తుంది.
అలా 2022-2023 2023-2024 2024-2025 విద్యా సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.210 కోట్ల మేర బకా యిలు పేరుకుపోయాయి. వీటిలో దాదాపు రూ.100 కోట్ల మేర నిధులు విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారం భం కానున్నాయి. అయినప్పటికీ బెస్ట్ అవైలబుల్ పాత బకాయిలు విద్యాసంస్థలకు అందలేదు.
ఈ నేపథ్యంలో ఈనెల 10 లో పు నిధులు విడుదల కాకపోతే, తాము తమ విద్యాసంస్థల్లో బెస్ట్ అవైలబుల్ అడ్మిషన్లు తీసుకొబోమని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. నిధులు విడుదల కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది టీచింగ్, నా న్ టీచింగ్ సిబ్బంది, 25 వేల మంది ఇతర సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నాయి.