10-06-2025 12:00:00 AM
చెంచు లోకం సంగం నేతలు
నాగర్ కర్నూల్ జూన్ 9 (విజయక్రాంతి): నల్లమల డిటిడిఓ పరిధిలో అక్రమంగా చేపట్టిన డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సోమవారం చెంచులోకం సంఘం అధ్యక్షులు కాట్రాజు శ్రీనివాసులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు. చెంచు గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో డిటిడిఓ పరిధిలోని పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు వారి వారి స్వలాభం కోసం అవసరం లేకపోయినా డిప్యూటేషన్ల పేరుతో విలాసాలకు పాల్పడుతున్నారని దీంతో గిరిజన విద్యార్థులు విద్య దూరమవుతున్నారని పేర్కొన్నారు.
అలాంటివారి డిప్యూటేషన్లను రద్దు చేయాలని వినతిలో కోరారు. విద్యా సంవత్సరం చివర్లో డిప్యూటేషన్లను రద్దు చేయాల్సి ఉన్నా డిటిడిఓ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉద్యోగుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ గిరిజన విద్యార్థులకు న్యాయంచేయాలనికోరారు