calender_icon.png 10 June, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.2.99 లక్షల కోట్లతో అమృత్ 2 అమలు చేస్తున్నాం

10-06-2025 12:00:00 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, జూన్ 9 (విజయ క్రాంతి): అమృత్-2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే వారికి నీళ్లను అందించేం దుకు 2 లక్షల 99 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా కింద 76 వేల 760 కోట్ల రూ పాయలను కేటాయించినట్లు తెలిపారు. మి గిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగర పా లక సంస్థలు సమీకరించుకుంటున్నాయని పేర్కొన్నారు.

అందులో భాగంగా అమృత్ 1, అమృత్ 2.0 కింద తెలంగాణలో  మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపా రు. సోమవారం చొప్పదండి పట్టణంలోని నల్లాలబావి వద్ద స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తో కలిసి రూ.36.3 కోట్ల వ్యయంతో ‘వాటర్ ఇంప్రూవ్ మెంట్’ స్కీంకు కేంద్ర మంత్రి శం కుస్థాపన చేశారు. అందులో భాగంగా భూ మి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ చొప్పదండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికీ సరిపడ నీళ్లను అందించాలనే లక్ష్యంతో  అమృత్ 2 పథకం కింద 36 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పైప్ లైన్, వాటర్ సంప్ ఇతర పనులను చేపట్టేందుకు శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకా రం చుట్ట డం చాలా ఆనందంగా ఉందన్నారు.

2015 జూన్ 25న ప్రారంభమైన అమృత్ 1 పథ కం కింద (2015-16 నుండి 2019-20 వర కు) కేంద్ర ప్రభుత్వం తన వాటాకింద ఖర్చు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. అమ్రుత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1 కోటి 34 లక్షల నీటి కనెక్షన్లు అందించగలిగామని, 1 కోటి 2 లక్షల మురుగునీటి కనెక్షన్లు అందించామన్నారు. వీటితో పాటు 2 వేల 411 పార్కులను అభివృద్ధి చే సుకోగలిగినం. 62 లక్షల 78 వేల  ఎల్‌ఈడీ లైట్లను మార్చుకోగలిగామని,

అట్లాగే 2021లో అమృత్ 2.0  పథకం ప్రారంభమైందన్నారు.

అమృత్ 1, అమృత్ 2.0 కింద మొత్తం 6 వేల 876 కోట్లు ఖర్చు చేయబోతున్నం. ఇందులో కేంద్ర వాటా 3 వేల 591 కోట్ల 72 లక్షల రూపాయలు,  రాష్ట్ర వాటా కింద 2 వేల 614 కోట్ల 82 లక్షల రూపాయలు. ఎం పిక చేయబడిన మున్సిపాలిటీల వాటా 66 9 కోట్ల 85 లక్షల రూపాయలు, అమృత్ 1 కింద 11 వందల 53 కోట్లు, అమృత్ 2 కిం ద 2వేల 438 కోట్ల రూపాయలను నరేంద్రమోదీ ప్రభుత్వం కేటాయించిందన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే అమృత్ 1, అమృత్ 2 కింద మొత్తం 852 కోట్ల 11 లక్షల రూపాయలు కేటాయించామ ని, అందులో కేంద్ర వాటా 481 కోట్ల 19 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 297 కోట్ల 55 లక్షలు, మున్సిపాలిటీల వాటా 73 కోట్ల 37 లక్షలు అన్నారు. చొప్పదండిలో ఎప్పుడో ఈ స్కీంను స్టార్ట్ చేయాల్సి ఉండేదని, గత ప్ర భుత్వం సహకరించకపోవడంవల్ల ల్యాండ్ కేటాయించలేదు.

లేకుంటే ఈ స్కీం ఇప్పటికే ప్రారంభమయ్యేదన్నారు.ఇయాళ అన్ని అ డ్డంకులను అధిగమించి పథకం పనులకు శ్రీ కారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నా రు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ పనులను పూర్తి చేసి చొప్పదండి ప్రజలకు ఇంటింటికీ సరిపడా నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

చొప్పదండి ఎమ్మెల్యే మేడి పల్లి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చొప్పదండి పట్టణ ప్రజలకు ఇంటింటికీ నీటిని సరఫరా చేయబోతున్నామన్నారు. అతి త్వరలోనే చొప్పదండి ప్రజల దాహార్తిని తీర్చబోతున్నామని, కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభి వ్రుద్ధిలో రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామనిఅన్నారు.